తెలుగు లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ గా ఎదిగిన నటశేఖర్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు బాలనటుడుగా కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు.  కెరీర్ బిగినింగ్ లో కాస్త ఎత్తు పల్లాలు చూసినా.. ముకుంద, అతడు, ఒక్కడు లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు.  అప్పటి వరకు మహేష్ బాబు ని బబ్లీ హీరోగానే చూశారు..కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది.  ఈ మూవీలో మాస్ లుక్ తో మహేష్ బాబు మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  తర్వాత దూకుడు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలతో ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరారు.  ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మరో అద్భుత విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాడు.  మహేష్ బాబు తన సహనటి నమ్రతా శిరోడ్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ జంటకు గౌతమ్ కృష్ణ, సితార లు పుట్టారు. మహేష్ బాబుకి షూటింగ్‌కు కాస్త విరామం దొరికితే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తారు. తాజాగా కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఒకే కుర్చీలో మహేశ్‌బాబు, గౌతమ్‌, సితార ముందు కూర్చొని ఉండగా, వెనుకవైపు నమ్రత నిలబడి ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రిన్స్ కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: