'అర్జున్ రెడ్డి'తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి  సెన్సేషనల్  డైరెక్టర్ అనిపించుకున్నాడు  సందీప్ రెడ్డి వంగ. ఈసినిమా తరువాత సందీప్ ,సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి  ప్రయత్నాలు చేశాడు. అందుకు తగ్గట్లు  మహేష్ కు కథ కూడా  వినిపించాడు.  కానీ  మహేష్ కు ఆ కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.  అయితే ఇంతలో అర్జున్ రెడ్డిని రీమేక్ చేయమని  సందీప్ రెడ్డి కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది.  అందుకు ఓకే చెప్పిన సందీప్.. అర్జున్ రెడ్డిని షాహిద్  కపూర్ , కియారా అద్వానీ  జంటగా  కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం  200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈచిత్రం ఈఏడాది అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో  చేరింది. 




ఇక మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో కూడా  బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన  సందీప్ కు   తాజాగామరో అవకాశం వరించింది. కబీర్ సింగ్  నిర్మాతలు  భూషణ్ కుమార్ , మురాద్ కేతాని లు కలిసి సందీప్ రెడ్డి డైరెక్షన్ లో  మరో సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యారు. క్రైమ్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి  అర్జున్ రెడ్డి  నిర్మాత  ప్రణయ్ రెడ్డి వంగ కూడా  ఓ నిర్మాత గా వ్యవహరించనున్నాడు.  ఈ విషయాన్ని  కొద్దీ సేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ హీరోగా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.  త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: