క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాల నెమ్మదిగా సినిమాలు తీస్తాడు. ‘ఫిదా’ లాంటి సూపర్ సక్సస్ అందుకున్న తరువాత ఈ డైరెక్టర్ కు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటన్నిటినీ వదులుకుని మళ్ళీ కొత్త వాళ్ళతో ఒక సినిమా తీయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ మూవీ షూటింగ్ దాదాపు సగం పూర్తి అయిన తరువాత ఆ కొత్త నటీనటులు చేస్తున్న యాక్షన్ తనకు నచ్చలేదు అంటూ ఆ మూవీ ప్రాజెక్ట్ ను అటకెక్కించాడు. 

ఇప్పుడు అదే కథను నాగచైతన్య సాయి పల్లవిలతో తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి క్యారెక్టర్ ఆర్టిస్టుల సీన్స్ అన్నీ పూర్తి కావడంతో ఇక కేవలం సాయి పల్లవి నాగచైతన్య లపై సీన్స్ మాత్రమే అనుకుని ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది అని తెలుస్తోంది. 

ఈ మూవీలో చైతన్య తెలంగాణ యాసతో కనిపించే హీరోగా నటిస్తే సాయి పల్లవి ఆంధ్రా ప్రాంతానికి చెందిన క్లాసికల్ డాన్సర్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత నాగచైతన్య తెలంగాణ ప్రాంత యువకుడుగా నటించే బాడీ లాంగ్వేజ్ లో అదేవిధంగా డైలాగ్స్ డెలివరీలో కొంత తేడా కనిపించినట్లు టాక్. 

దీనితో చైతన్యకు తెలంగాణ భాషకు సంబంధించిన యాస పై మరింత పట్టు పెంచుకోవడానికి చైతన్యను మళ్ళీ తెలంగాణ యాస చెప్పే ట్యూటర్ ను చైతన్య వద్దకు మళ్ళీ పంపుతున్నట్లు టాక్. దీనితో చైతన్యకు ఆ భాష పై పట్టు దొరకడానికి కొద్ది కాలం పడుతుంది కాబట్టి మధ్యలో సాయి పల్లవి డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకోవడం లాంటి సమస్యలతో ఈ మూవీ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: