అయితే ఇప్పుడు ఈ షో ను బ్యాన్ చేయాలని కోరుతూ రాజస్థాన్ కు చెందిన కర్ణి సేన ప్రతినిధులు కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవడేకర్ కు ఓ లేఖ రాసారు. బిగ్ బాస్ షో ఫ్యామిలీ తో కూర్చొని చూసేలా లేదని..భారతీయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా వుందని ఈ అసభ్యకరమైన షో ను వెంటనే నిలిపివేయాలని కర్ణి సేన ప్రతినిధులు ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈరియాల్టి షో ద్వారా జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలను అవహేళన చేయడమే గాక జిహాద్ ను ప్రమోట్ చేస్తున్నట్లు వుందని వారు ఆలేఖలో వెల్లడించారు. ఇంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవిస్ కు కూడా ఈ షో ను బ్యాన్ చేయాలని కర్ణి సేన ప్రతినిధులు లేఖ రాశారు.
ఇక ఈ రియాల్టీ షో సౌత్ కు కూడా విస్తరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ్ లో ఈ షో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లను పూర్తి చేసుకోగా తెలుగులో ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తుంది. సౌత్ లో కూడా ఈ షో పై అనేక విమర్శలు వెలుబడుతున్నాయి.