'నాపేరు సూర్య' తో దారుణమైన పరాజయాన్ని చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని చాలా స్టోరీలు వినే చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని అనేక రికార్డులు సృష్టించాయి. దీంతో ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న అల వైకుంఠ పురంబులో అనే సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు మంచి ఆదరణ దక్కించుకోగా తాజాగా దసరా కానుకగా సినిమాకి సంబంధించిన పిక్ ఒకటి విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఇటువంటి నేపథ్యంలో అల్లుఅర్జున్ కెరీర్కి కీలకమైన సమయం ప్రస్తుతం ఉన్న తరుణంలో అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ ఒక పోస్టర్ ఇటీవల దర్శనమిచ్చింది. అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందినవాళ్లు విమర్శలు చేయడం ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


విషయంలోకి వెళితే “ తెలుగు సినీ ప్రేక్షకులు ఇతన్ని హీరోగా భావిస్తున్నారు. కానీ ఇతను మాత్రం(మాతృ) తెలుగు సినీ కార్మికుల పొట్ట కొడుతున్నాడు ఎందుకు???” తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని ఒక ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ వి రెండు ఫోటోలు పెట్టి ఇదంతా రాసి ఉంది.మరి ఇది పాతదా లేక కొత్తవా అన్నది ఇంకా ఏదీ తెలీడం లేదు. కావాలనే ఎవరైనా ఇలా చేసారా? లేక అల్లు అర్జున్ వల్ల ఎవరైనా నష్ట పోయారా అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: