టాలీవుడ్ లో పదేళ్ళ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.  మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది రైతులకు సంబంధించిన మెసేజ్ కావడంతో చిరంజీవి పై మెగా అభిమానులు గౌరవం మరింత పెరిగింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నరసింహారెడ్డి మూవీ ఎక్కించారు.  మూవీకి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించారు. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. దాంతో చిరంజీవి తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న కొరటాల శివ అ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకొని ఈ సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ మూవీ షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం బాక్సాఫీస్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు.

 

ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దల కొండ గణేష్ మూవీలో వరుణ్ తేజ్ నటించాడు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం నేను ముగ్గురు హీరోలు షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ అయితే వరుసగా సినిమాలు రిలీజ్ కావచ్చు. ఇక అసలైన విషయం ఏంటంటే బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు ఈ మూవీ కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏడాది మెగా హీరోల సందడి బాగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: