సైరా తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం  కొరటాల శివ దర్శకత్వంలో తన 152 వ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజుల నుండి ఈచిత్రం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఇటీవల ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా హాజరైన చిరు అనుకోకుండా ఆ ఈవెంట్ లో  ఈసినిమా టైటిల్ ఆచార్య అని చెప్పేశాడు. నిజానికి చిరు చెప్పే కన్నా ముందే టైటిల్ లీక్ అయ్యింది కానీ ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది. అయితే స్వయంగా చిరు నే చెప్పేసరికి ఇప్పుడు టైటిల్ ఏంటో అందరికి తెలిసిపోయింది. దాంతో  కొరటాల అసహానానికి గురైయ్యాడట. ఇక ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను మార్చే ఆలోచనలో వున్నాడట. 
 
ఎలాగూ ఈ చిత్రంలో మరో హీరో (మహేష్ బాబు ) నటించాల్సి వుంది దాంతో ఆచార్య ముందు లేదా వెనక మరో పేరును  చేర్చాలని శివ  బావిస్తున్నాడట దాంతో ఈ సినిమా టైటిల్ మారే అవకాశాలు ఎక్కువ గా వున్నాయని తెలుస్తుంది. ఉగాది కానుకగా మార్చి 25న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.  ఈ చిత్రం లో చిరు సరసన త్రిష కథానాయికగా నటించనుండగా  రెజీనా కాసాండ్రా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వీరితోపాటు బాలీవుడ్ నటుడు సోను సూద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో రానున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ను థియేటర్లలోకి తీసుకువచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: