ఈ మధ్యకాలంలో తల్లిదండ్రలు పిల్లలను కావాలని చంపుతారో అనుకోకుండా చంపుతారో తెలియదు కానీ తల్లిదండ్రుల చేతిలో మాత్రం పిల్లలు చస్తున్నారు. ఇంకా విషయానికి వస్తే.. అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరాతి ఘోరమైన ఘటన జరిగింది. కన్నా తల్లిదండ్రులే పసి పాపను పొట్టన పెట్టుకున్నారు. 

                                           

అత్యంత దారుణంగా పసిపాపను చంపేసి శవం మాయం చెయ్యడానికి శతవిధాలా ప్రయత్నించారు. అలా మాయం చెయ్యడం కోసం తల్లిదండ్రులు ఇద్దరు ఓ బకెట్ లో యాసిడ్ పోసి, పాప మృతుదేహాన్ని దానిలో ముంచేశారు. అనంతరం పాప కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందించారు. 

                    

దీంతో వెంటనే మోనికా డోమింగాజ్, గెరార్డో జవేలా లోరెడో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో కూడా అనేకమార్లు పాపను హింసించినందుకు కేసులు నమోదయ్యాయి. ఆ తరహాలోనే వీరిని అనుమానించిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలిశాయి. తమ కుమార్తె రెబెకా స్నానం చేసే సమయంలో బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయిందని ఆ తల్లిదండ్రులు చెప్పారు. 

                                    

దాంతో ఏం చేయాలో తోచకపోవడంతో ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించినట్లు వారిద్దరూ ఒప్పుకున్నారు. అయితే ఆ పాప మృతదేహం పూర్తిగా నాశనం అయిపోవడంతో ఆమె మృతికి కారణాలు తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణమైన ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తల్లికి ఇరవై ఏళ్లు, తండ్రికి 14ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: