అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని మృతి ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. తాజాగా అమెరికాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలోని ఇండియానా లో గల యూనివర్సిటీ ఆఫ్ నాట్రే డామోలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతోంది. అయితే ఉన్నట్టుండి ఒకరోజు ఆమె యూనివర్సిటీలో ఉన్న ఓ చెరువు లో శవమై కనిపించింది. వివరాలోకి వెళ్తే..

 

ఆన్రోస్ జెర్రీ అనే యువతి కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఆమె బ్లెయిన్ స్కూల్ లో చదువుకుని ఆ తరువాత సైన్స్ , బిజినెస్ లో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. చదువులో ఎప్పుడూ ముందు ఉండే జెర్రీ ఆట , పాటలలో కూడా ముందుండేదని తెలుస్తోంది. అంతేకాదు పియానో, ఫ్లూట్ వాయించడంలో జెర్రీ నిష్ణాతురాలని,  యూనివర్సిటీలో జరిగే ప్రతీ సంస్కృతిక కార్యక్రమాలలో జెర్రీ చాలా చురుకుగా పాల్గోనేదని అంటున్నారు యూనివర్సిటీ అధికారులు.

 

 

తన గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వగానే ఆ తరువాత డెంటల్ కోర్సు చదవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా స్నేహితులు తెలిపారు. ఈ లోగానే ఇలా ఆమె అనుమానాస్పదంగా మరణించడం ఎంతో బాధని మిగిల్చిందని వాపోతున్నారు. అయితే ఆమె శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, ప్రమాదవశాత్తు చెరువులో పడి , మరణించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: