ప్రపంచంలో కరోనా కేసులు రోజు రోజు కీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అమెరికాలోని నాట్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.   అమెరికాలో కరోనా విలయతాండవంతో ఇక్కడ ఉన్న పేదలు, నిరాశ్రయులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బాల్టిమోర్‌లోని పేదలకు ఆహారాన్ని అందించేందుకు నాట్స్ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఆహారాన్ని మేరీల్యాండ్ ఫుడ్ బ్యాంక్‌కు అందచేసింది. మేరీల్యాండ్ ఫుడ్ బ్యాంక్ నిరుపేదలకు ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలి తీర్చే సంస్థ కావడంతో నాట్స్ వారికే తాను సేకరించిన ఆహారాన్ని అందచేసింది.
 
 
నాట్స్ నాయకులు విజయ్ శేఖర్ అన్నే, అశోక్ గుత్తా సహాకార సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కిరణ్ యార్లగడ్డ, అనుపమ గార్లపాటి, అంజలి యార్లగడ్డ, సిదార్థ సూరపనేనితో పాటు యువ వాలంటీర్లు సాహితీ, సహస్ర ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం అందించారు. 
 
కరోనాపై పోరాడే క్రమంలో ఇలాంటి సేవ కార్యక్రమాలను ప్రోత్సాహించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ డాలస్ విభాగం నుండి అశోక్ గుత్తా, బాల్టిమోర్ నాట్స్ హెల్ప్ లైన్  కోఆర్డినేటర్ కిరణ్ యార్లగడ్డ లు ఈ విషయంలో చూపుతున్న చొరవను వారు ప్రశంసించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: