అనంతపురం జిల్లా హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరపున గోరంట్ల మాధవ్ వేసిన నామినేషన్ నీ తిరస్కరించడానికి చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారని ప్రస్తుతం వస్తున్న వార్తలు విషయంలో గోరంట్ల మాధవ్ స్పందించారు. తన పదవికి రాజీనామా చేసిన సమయంలో వైసీపీ పార్టీ తరఫున నిలబడుతున్న అన్న విషయం తెలుసుకుని చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు చెందిన తనని అనేక ఇబ్బందుల పాలు చేశారని ఇటీవల మీడియా ముందు పేర్కొన్నారు.


ఈ క్రమంలో బడుగు బలహీన వర్గాలకు మరియు పేద ప్రజలకు అండగా ఉండే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ తన రాజీనామా విషయంలో మరియు లోక్సభ నామినేషన్ విషయంలో వెనకుండి నడిపించి నామినేషన్ దాఖలు అయ్యేటట్లు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.


అయితే ఈ విషయంలో కూడా బాబు బడుగు బలహీన వర్గాలకు చెందిన ని హిందూపురం తరఫున లోక్సభ మెంబర్గా వెళ్లకుండా చేయడానికి తాను వేసిన నామినేషన్ పట్ల హైకోర్టుకు వెళ్లారు అని తనని అడుగడుగున ఇబ్బందులపాలు చేస్తున్నారని ఇటువంటి పరిస్థితి శత్రువు గా భావించే చంద్రబాబుకు కూడా రాకూడదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతుందని దమ్ముంటే చంద్రబాబు వైసిపి పార్టీ గెలుపును ఆపగలరా అంటూ ఛాలెంజ్ విసిరారు గోరంట్ల మాధవ్.



మరింత సమాచారం తెలుసుకోండి: