మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కియా ఫ్యాక్టరీ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని గోరంట్ల మాధవ్ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు కియా ఫ్యాక్టరీ విషయంలో అబద్ధాన్ని నిజం చేయాలని భావిస్తున్నారని అన్నారు. 
 
తనను జగన్ హత్య చేశారని తాను చనిపోయాను కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరేంత సమర్థుడు చంద్రబాబు అని గోరంట్ల మాధవ్ అన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది కూడా తాను కాదని తన ఆత్మ అని చంద్రబాబు భ్రమింపజేయగడని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. చనిపోకున్నా చనిపోయానని చెప్పి జగన్ కు జీవిత ఖైదు వేయించేంత సమర్థుడు చంద్రబాబు అంటూ చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ధర్మబద్ధంగా పాలిస్తున్నారని సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. చంద్రబాబు ఇకనుండైనా నీచ రాజకీయాలు మానుకోవాలని రాయలసీమ జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయని యుక్త వయస్సు రాగానే పెళ్లిళ్లు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు కియా ఫ్యాక్టరీ విషయంలో కావాలనే దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు ప్రక్షాళన కావాలంటే రాయలసీమలో అడుగుపెట్టే ముందే కియా దగ్గరకు వచ్చి చంద్రబాబు నేలకు ముక్కు రాయలని గోరంట్ల మాధవ్ అన్నారు. తాను దౌర్జన్యం చేశానని కియా దగ్గర చంద్రబాబు చెబుతున్నాడని పేదలకు ఉపాధి కల్పించటమే తమ ఉద్దేశం అని గోరంట్ల మాధవ్ అన్నారు. తాను నివశించే ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని వారి ఉద్యోగాల కోసం నిలదీసి సాధించుకుంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను కియా ప్లాంట్ విషయంలో తప్పుడు ప్రచారం చేయవద్దని తాను కోరానని గోరంట్ల మాధవ్ అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: