ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎంతో యాక్టివ్ గా  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడం విషయంలో అయినా... అసెంబ్లీలో అందరినీ ఆకర్షించే విధంగా మాట్లాడాలి అన్న... పాలన విషయంలో అయినా ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా  ఉంటారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పుష్పశ్రీవాణి అమితంగా అభిమానిస్తాను ఉంటారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి... పలుమార్లు వివిధ విషయాల్లో కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు పుష్ప ఉప ముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

 

 

 నిన్న విజయనగరంలో జరిగిన వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న వైసిపి పార్లమెంట్ సభ్యుడు కీలక నేత అయిన విజయ్ సాయి రెడ్డి ఓదార్చునప్పటికీ ఆమె మాత్రం వలవల ఏడ్చేశారు. ఇక కళ్ళలోంచి పొంగుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేక పలుమార్లు కర్చీఫ్ తో  తుడుచుకున్నారు. అయితే రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయనగరంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అధికార పార్టీ. ఈ సమావేశానికి వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లంపల్లి శ్రీనివాస్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. 

 

 

 అయితే సమావేశం ప్రారంభం లో వేదికపైకి విజయసాయి రెడ్డి, బొత్స పుష్పశ్రీవాణి, శ్రీనివాస్ తో పాటు పలువురు ముఖ్య నేతలను వేదికపైకి పిలిచారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు వేదిక కిందే కూర్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత పుష్ప శ్రీ వాణి భర్త పరీక్షిత్ రాజును  స్టేజిపైకి పిలవక పోవడంతో పుష్ప శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు అని భావించిన అక్కడి నేతలు... పరీక్షిత్ రాజును స్టేజిపైకి పిలవడంతో ఉప ముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి కన్నీళ్లు ఆపారు. అయితే గతంలో కూడా అసెంబ్లీ వేదికగా ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: