నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ప్రభుత్వం, అధికారులపై విమర్శలు చేస్తూ, వార్నింగ్ లు ఇస్తూ ప్రెస్ మీట్ ను మమా అనిపించేశారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ గనుకా అమలు చేయకపొతే ఎలాంటి అధికారులపైన అయినా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరికలు జారీ చేశారు. మరో వైపు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తాము సహకరించేది లేదని చేతులు ఎత్తేస్తున్నాయి. దాంతో ఎన్నికలు ఎలా జరుగుతాయని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సుప్రీం కోర్టు ఆగమంటే తప్ప ఎన్నికలను వాయిదా వేసేలా నిమ్మగడ్డ కనపడటం లేదు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఎన్నికలు ఎలా జరుగుతాయనే సందిగ్ధత నెలకొంది. ఇదిలాఉంటే ఏపీ ఎన్జీవో సంఘం సంచలన ప్రకటన చేసింది. ఎన్నికలకు నిమ్మగడ్డ పట్టుబడితే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కరోనా టీకాలు వేసిన తరువాత మాత్రమే ఎన్నికల విధులు చేపడుతామని తేల్చి చెప్పారు. ఒక వేళ మా పై చర్యలు తీసుకోవాలని అనుకుంటే తీసుకోండి అంటూ తెగేసి చెప్పింది. నిమ్మగడ్డ మాత్రం ప్రెస్ మీట్ లో ఎవరూ తీసుకొని విధంగా జాగ్రత్తలు తీసుకుని చుట్టూ రక్షణ కవచాలు పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టచ్చు ఆయనకు ఉన్న భయం సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు ఉండదా అంటూ మండిపడ్డారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు ఎలా అనే అంశం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.