రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. దీంతో మహిళలకు అటు ఇటు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ మధ్య కాలంలో కట్టుకున్న వారే మహిళల పాలిట కాలయముడిగా మారి చివరికి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పొన్నూరు పట్టణం లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పొన్నూరు పట్టణం లో 14వ వార్డు కు చెందిన దోనేపూడి సురేష్ తన భార్య సంతోషి కుమారితో కలిసి జీవిస్తున్నారు. ఇటీవలే ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్త సురేష్ బాబు ఏకంగా భార్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.
ఈ మధ్యకాలంలో మద్యంతో పాటు పలు చెడు అలవాట్లకు బానిస గా మారిపోయాడు సురేష్ బాబు. తరచూ భార్య భర్తల మధ్య ఇదే విషయంపై గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక చెడు వ్యసనాలు మానుకోవాలని భార్య భర్త కు ఎన్ని సార్లు సూచించినప్పటికీ భర్త తీరులో మాత్రం మార్పు రాలేదు. కాగా ఇటీవల మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న సురేష్ బాబు కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న కర్ర తో భార్య గొంతు బలంగా నొక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎంతో నేరం అంగీకరించాడు.