భారతదేశ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సుమారు 50 శాతానికి పైగా ప్రజలు ఈ వ్యవసాయం వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా ఈ వ్యవసాయం అనేది ప్రకృతి పరిస్థితుల మీద క్కువగా ఆధారపడినది కావడంతో అన్నదాతలకు అనేక రకాల ఆటుపోట్లకు గురవుతున్నారు. ఇక వారికి ఎంతో కొంత మేలు కలిగేలా రైతుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌' అనే ఒక పథకం రూపొందించి అమలులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి గాను రూ.6,000 అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది.



కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 11.17 కోట్ల మంది వ్యవసాయ రైతులకు నేరుగా ఈ 'పీఎం కిసాన్ సమాన్ నిధి' స్కీమ్ కింద డబ్బులు అందిస్తోంది. ఇంకా కొంత మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదు. అయితే డబ్బులు రాని రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయొచ్చు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్స్‌లో ఇదే అతి పెద్ద పథకం. అర్హత కలిగిన ప్రతి రైతులకు స్కీమ్ ప్రయోజనాలు అందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల మీకు ఈ పథకం కింద డబ్బులు రాకపోతే మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్‌ను కలవండి. ఒకవేళ వీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే.. అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan-ict@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు.

పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్లు..


PM Kisan Toll Free Number: 18001155266
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Numbers: 011-23381092, 23382401

PM Kisan's new helpline: 011-24300606
PM Kisan helpline: 0120-6025109

మరింత సమాచారం తెలుసుకోండి: