వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిపుత్రులకు శుభవార్త చెప్పింది.. ప్రస్తుతం చలికాలం కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం ఉచితంగా దోమ తెరలు పంపిణీ చేయనుంది. తద్వారా గిరిజనులను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికి దోమ తెరలను పంపిణీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గాలిలో తేమ అధికంగా ఉండే వానాకాలం, శీతాకాలాల్లో పెరిగే దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 ఐటీడీఏల పరిధిలో 25.16 లక్షల గిరిజన కుటుంబాలకు దోమ తెరలను అందిస్తున్నామన్నారు. అలాగే గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో వివిధ రకాల విష జ్వరాలు అలాగే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం అన్నారు. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చున్నారు. ప్రతి ఏటా గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేస్తున్నా కొంత మందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో మూసిపెట్టుకుంటున్నారన్నారు.. ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏ జిల్లాల పిధిలో పరిధిలో ఉన్న 25 లక్షల 16 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో దోమ తెరలను పంపిణీ చేస్తున్నట్లు పుష్ప శ్రీవాణి తెలిపారు. ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: