కరెంట్ మినిష్టర్ వే కానీ... ని దగ్గర పవరే లేదు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ విస్కీలో సోడా లు కలిపే నువ్వా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మాట్లాడేది..? అని ఆయన ఆరోపించారు. ఉత్తమ్ కెప్టెన్ ... నువ్వు సాదాసీదా అడ్వకేట్ వి అని ఆయన అన్నారు. మేము తలుకుంటే .. నువ్వు తిరగగలుగుతావ..? అని నిలదీశారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక... నీ సంగతి తెలుస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ని చిట్టా అంత బయట పెడతాం అని హెచ్చరించారు. మినిష్టర్ పోస్ట్ ఉంది కదా అని పోజులకు పోకు..? అని అన్నారు.
కేసీఆర్ మీద 45 ఏండ్ల క్రితమే కేసులు అయ్యాయి అని ఆయన మండిపడ్డారు. పాస్ పోర్టుల కేసులో ఉన్న కేసీఆర్ కింద పనిచేస్తున్న నువ్వా మాట్లాడేది..? అని నిలదీశారు. తెలంగాణ ఇయ్యకపోతే... ఎవడి జగదీష్ రెడ్డి..? అని నిలదీశారు. నా పాస్ పోర్ట్ కేసు కి గురువులు.. హరీష్ ..కేసీఆర్ లే అని ఆయన ఆరోపించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరించారు. ఇంకోసారి ఉత్తమ్ మీద మాట్లాడితే... నీకంటే ఎక్కువ మాట్లాడతం అని జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.