ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల (రైతుల) కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఒక కొత్త స్కీమ్ అమలులోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ స్కీంలో భాగంగా ప్రధాని మోదీ సర్కార్ ప్రతి ఏడాది రైతులకు 6 వేల రూపాయలను ఆర్ధిక సాయంగా అందిస్తోంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకే ఈ డబ్బులు డిపాజిట్ చేయబడుతున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా సంవత్సరం మొత్తం మీద మూడు విడతల్లో అన్నదాతలకు అందజేయటం జరుగుతుంది. ఈ ఆర్ధిక సాయంతో రైతులు తమ తమ వ్యవసాయ పనుల అవసరార్ధం వినియోగించుకుంటారు.



ప్రధాని నరేంద్ర మోదీ అందించే ఈ 6 వేల రూపాయలు.. మూడు విడతల్లో అంటే 2 వేల రూపాయల చొప్పున మొత్తం మూడు దఫాలుగా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలలోకి వచ్చి చేరతాయి. ఇక ఈ పధకం ప్రవేశపెట్టి ఇప్పటికే ఏడు విడతలుగా పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాలోకి వచ్చి చేరాయి. ఇక 8వ విడత డబ్బులు అతి త్వరలోనే మరోసారి రైతుల బ్యాంక్ ఖాతాలోకి రానున్నాయి. ఈ పీఎం కిసాన్ 8వ విడత డబ్బులు ఏప్రిల్ నెలలో బ్యాంక్ ఖాతాల్లోకి చేరొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలానికి ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలోకి చేరొచ్చు. అయితే ఈ డబ్బులు ఏప్రిల్ నెలలోనే వస్తాయో లేదో కరెక్ట్‌ గా చెప్పడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల ఆరంభం నుంచి ఎప్పుడైనా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వేయొచ్చు. ఇకపోతే ఇప్పటి దాకా పీఎం కిసాన్ స్కీమ్ కింద 9 కోట్ల మందికి పైగా డబ్బులు చేరుతున్నాయి. అయితే ఈ స్కీమ్ కింద అర్హత లేని వారు కూడా లబ్ది పొందితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: