తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం అయినా గెలిచే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఎన్నికల సంఘం సహకరిస్తుంది అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పక్షాన  సీఈవోను కలిశాం అని ఆయన తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుంది అని ఆరోపించారు.  ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెడుతుంది అని అన్నారు.  ఉద్యోగులకు 29 శాతం  పీఆర్సీ ఆంటూ లీక్ ఇచ్చారు అని ఆరోపించారు. టీ.ఆర్.ఎస్ ను ఓడిస్తే.. ఉద్యోగుల కు అనుకూలమైన ఫిట్మెంట్ వస్తుంది అని అన్నారు. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారు అని మండిపడ్డారు.  వేల కోట్ల రూపాయలు పంచుతున్నారు అని విమర్శలు చేసారు.  ఓటర్లను తరలించడానికి ప్రైవేట్  స్కూల్ బస్సులను బలవంతంగా వాడుకుంటున్నారు అని మండిపడ్డారు.

 వాటిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.  టిఆర్ఎస్ దొంగ ఓట్లను ఏపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని అడ్డుకోవాలి అని కోరారు. పోస్టల్ ఓట్లను పోలీసులు సేకరించి టిఆర్ఎస్ కు వేసేలా పని చేస్తున్నారు అని అన్నారు. వాళ్ళను అడ్డుకోవాలి అని చర్యలు తీసుకోవాలి అని కోరారు. వందల కోట్ల యాడ్స్ పై ఇన్ కమ్ ట్యాక్స్ విచారణ జరపాలి అని విజ్ఞప్తి చేసారు. ఎవరు ఈ డబ్బులు ఇస్తున్నారు వారిపై చర్యలను తీసుకోవాలి అని ఆయన కోరారు. పీవీ నరసింహారావు బతికున్నప్పుడు బూతు మాటలు మాట్లాడి.. ఇప్పుడు ఆయన బొమ్మ వాడకోవడాన్ని ఆక్షేపించాం అని అన్నారు. మా నాయకుడి ఫోటో పట్ల సీఈవో కు మా అభ్యంతరం తెలిపాం అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: