ఈ మధ్య కాలం లో సోషల్ వాడకం ఎంతలా  పెరిగి పోయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం సెకండ్ల వ్యవధి లోనే సోషల్ మీడియా లో తెలుసుకుంటున్నారు. ఎలాంటి సమాచారం కావాలి అన్న సోషల్ మీడియాలో దొరుకుతూ ఉండడం తో ఎంతో మంది సోషల్ మీడియా నుంచి ముఖం పక్కకు తిప్పడానికి కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రపంచం లో ఎక్కడో జరిగిన విషయాలు కూడా కేవలం క్షణాల వ్యవధి లోనే కళ్ళముందు వాలి పోతూ ఉన్నాయి.


 అయితే సోషల్ మీడియా వేదికగా జరిగే కొన్ని రకాల సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక బామ్మ కూడా ఇలాగే తన మనసులో మాట బయటపెట్టి ఏకంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె వయసు 73 ఏళ్లు.. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసి  ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ఇంతకీ ఆ 73 ఏళ్ల బామ్మ ఇచ్చిన ప్రకటన ఏంటి అంటారా.. అదేమీ లేదండి తనకు ఒక వరుడు కావాలి అంటూ ప్రకటన చేసింది ఆ 73 ఏళ్ల బామ్మ.



 ఏంటి ఆశ్చర్య పోయారు కదా.. కానీ ఇది నిజం గానే జరిగింది కర్ణాటకలోని మైసూర్ కు చెందిన వృద్ధురాలు భర్తతో విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉండలేక పోతున్నామని శేష జీవితం అంతా భర్తతోనే గడపాలని అనుకుంటున్నాను అంటూ సదరు మహిళ తెలిపింది. అయితే తనకంటే పెద్ద వయసు ఉండి ఆరోగ్యవంతులుగా ఉన్న భర్త కావాలి అంటూ సదరు మహిళ తెలిపింది . తనది బ్రాహ్మణ కులం కాబట్టి ఇక తనను పెళ్లి చేసుకోవాలని అనుకునే వ్యక్తి కూడా తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయి ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది ఆ బామ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: