ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు చెక్ పెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే తిరుపతి పోరులో వైసీపీ, టీడీపీలని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు.అలాగే ఆ రెండు పార్టీలు చేసే విమర్శలకు వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ-జనసేనలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శలు చేశారు. పవన్‌ని సీఎం చేస్తామని చెప్పి వీర్రాజు జనాల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టాలని చూస్తున్నారని సెటైర్లు వేశారు. ఇక దీనికి వీర్రాజు కూడా కౌంటర్ ఇచ్చారు.


కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా అంటూ సాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అలాగే తిరుపతి ప్రజలకి తాము ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తామని, బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయని వీర్రాజు సెటైర్ వేశారు.


అయితే ఇక్కడ సోము కౌంటర్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సోముకు సత్తా ఉంటే, తిరుపతిలో గెలిచి తాము ఏంటో చూపిస్తామనే మాట చెబుతారు. కానీ అలా చెప్పలేదు. ఎందుకంటే తిరుపతిలో బీజేపీకి గెలిచే సత్తా లేదు. ఇక తాజాగా సోము టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ గతంలో జగన్‌ని ప్రశంసిస్తూ పెట్టిన ఓ పోస్టుని టీడీపీ కార్యకర్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక దీనికి ప్రతిగా సోము, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ గతంలో కాంగ్రెస్‌లో ఉండగా చంద్రబాబుపై విమర్శలు చేసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు.


అయితే ఇదంతా చూస్తుంటే సోము సిల్లీ స్ట్రాటజీలతో ముందుకెళుతున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ఇలా విమర్శలు చేసి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళినవారు చాలామంది ఉన్నారు. గతంలో టీడీపీలో ఉండి మోదీని, అమిత్ షాని చెడామడా తిట్టి, ఇప్పుడు అదే బీజేపీలో చేరిన నాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: