వాళ్లిద్దరూ ఒక్కరిని ఒక్కరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులు కాపురం సజావుగానే సాగింది. ఒక పాప పుట్టింది. పాప పుట్టిన కొన్నిరోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చీటికీమాటికీ గొడవపడుతుండేవారు. భర్తతో గొడవ పడి ఆ మహిళ పుట్టింటికి వెళ్లింది. చాలా నెలల నుంచి పుట్టింట్లోనే ఉంది. తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త కూడా రాలేదు. అతను సొంతూళ్లోనూ లేడని తెలిసింది. మహిళ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి మీ ఆయన కనిపించాడని.. హైదరాబాద్‌లో ఉన్నాడని చెప్పాడు. తన వద్దకు తీసుకెళతానని నమ్మించాడు.

అతడు మాయమాటలు చెప్పి ఓ వివాహితను హైదరాబాద్‌ తీసుకెళ్లిన వ్యక్తి.. ఆమెను గదిలో నిర్బంధించి, అత్యాచారం చేయడమే కాకుండా వ్యభిచారం చేయాలని చిత్రహింసలకు గురిచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ బాధిత మహిళను  రెండేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఎనిమిది నెలల క్రితం సదరు మహిళ తల్లిగారి గ్రామమైన భద్రాచలం సమీపంలోని ఎటపాకకు వెళ్లి ఉంటోంది.

ఈ తరుణంలోనే అంకన్నగూడెంకు చెందిన భూక్యా సర్వేశ్‌ నెల కింద ఏటపాక వెళ్లి తన భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడని, అతని దగ్గరకు తీసుకెళ్తానని   చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె సర్వేశ్‌తో రాగా.. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని అద్దె గదిలో బాధితురాలిని, ఆమె కూతురును ఉంచాడు. భర్త విషయం ఎప్పుడు అడిగినా దాటవేయడంపై ఆమె సర్వేశ్‌ను నిలదీయడంతో చిత్రహింసలకు పాల్పడ్డాడు.

ఇక ఒంటిపై సిగరెట్లతో కాల్చడమే కాకుండా, వ్యభిచారం చేయాలని కొట్టేవాడు. ఆమెతో పాటు కుమార్తె చేతులపై కూడా సిగరెట్లతో కాల్చేవాడు. సర్వేశ్‌ తన స్నేహితులను గదికి తీసుకొచ్చి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను లాక్కొని అమ్ముకున్నాడు. ఓ రోజు ఆ ఇంటి యజమాని సాయంతో ఆమె బయటపడి.. అంకన్నగూడెం చేరుకొంది. భర్త, అత్తకు విషయం చెప్పగా.. వారు గార్ల పోలీస్‌స్టేషన్‌లో సర్వేశ్‌పై ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: