టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి విషయంలో టీడీపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలని దాడి చేసారని చంద్రబాబుని భయపెట్టే విధంగా దాడి చేసారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తమకు ప్రతికూలంగా ఉండబట్టే ఈ విధంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మీడియాతో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రజలు నమ్మి జగన్ ను కనకపు సింహసనంపై కూర్చోబెట్టినా ఆయన తీరు మారలేదు, బుద్ధిలో మార్పు రాలేదు అని ఆయన మండిపడ్డారు. 'కనకపు సింహసనమున శునకమును కూర్చోండ బెట్టిన వెనకటి గుణమేల మారును వినరా సుమతీ అని వేమన'గారు చెప్పారు.. ప్రస్తుతం జగన్ వైఖరి ఆ మాదిరిగానే ఉంది అని ఆయన ఆరోపణలు చేసారు. ఏపీ ప్రజానీకం జగన్ ను సీఎం హోదాలో కూర్చోబెట్టినప్పటికీ తన సహజ బుద్దిని మార్చుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు అని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చంద్రబాబు పరితపిస్తే జగన్ మాత్రం హింసాంధ్రప్రదేశ్ చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లో చెప్పులు విసిరిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి రాళ్లు విసిరిస్తున్నారు  అని విమర్శలు చేసారు. అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నా తిరుపతిలో టీడీపీకి వస్తోన్న స్పందన చూసి ఓర్వలేకే ఇలాంటి దుశ్చర్యకు దిగుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఆటంకాలు ఎన్ని సృష్టించినప్పటికి వెనకడుగు వేసే అలవాటు టీడీపీ కార్యకర్తలకు లేదని గ్రహించాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: