రాజకీయంగా ఈ పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. గతంలో ఎవరైనా సరే పార్టీ మారిన సరే టిఆర్ఎస్ పార్టీ పెద్దగా ఇబ్బంది పడేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ ఎక్కువగా రాష్ట్రంలో ఫోకస్ చేసింది. ఎవరైనా సరే టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. అందుకే సీఎం కేసీఆర్ కాస్త నాగార్జునసాగర్ లో అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బహిరంగ సభ నిర్వహించిన సరే టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాబట్టి సీఎం కేసీఆర్ చాలా వరకు కూడా జాగ్రత్తగా అక్కడున్న పార్టీ నేతలతో చర్చలు జరిపి అందరినీ కూడా ముందుకు వెళ్లాల్సిందిగా సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు టిఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. జానారెడ్డి దాదాపుగా గెలిచే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.