ఇప్పటికే రాష్ట్రంలో పాజిటవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలింపు ఇస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టం కలుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలను సడలిస్తున్నారు.వ్యాపార కార్యకలాపాలకు ప్రస్తుతం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సమయాన్ని కేటాయించారు. రోడ్లపై రద్దీ కూడా లాక్డౌన్లో తగ్గింది.అనవసరంగా బయటికి వచ్చే వారిపై పోలీసులు కఠినంగా వ్యవరిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కోట్లలో ఫైన్లు వేసి..బైక్లను సీజ్ చేశారు.కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమయంలో లాక్డౌన్ తెలంగాణ ప్రభుత్వం కఠినంగా అమలుచేసింది.దాని ఫలితంగానే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య నిపుణలు అంటున్నారు.ఇప్పుడు కేసులు తగ్గుమఖం పట్టడంతో లాక్డౌన్ని ఎత్తివేసి నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించనున్నారు.ఇటు అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో కూడా అంతరాష్ట్ర సర్వీసులపై పలు దఫాలుగా చర్చలు జరిగిన తరువాత బస్సుల రాకపోకలు సాగాయి.
ఇప్పటికే రాష్ట్రంలో పాజిటవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలింపు ఇస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టం కలుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలను సడలిస్తున్నారు.వ్యాపార కార్యకలాపాలకు ప్రస్తుతం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సమయాన్ని కేటాయించారు. రోడ్లపై రద్దీ కూడా లాక్డౌన్లో తగ్గింది.అనవసరంగా బయటికి వచ్చే వారిపై పోలీసులు కఠినంగా వ్యవరిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కోట్లలో ఫైన్లు వేసి..బైక్లను సీజ్ చేశారు.కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమయంలో లాక్డౌన్ తెలంగాణ ప్రభుత్వం కఠినంగా అమలుచేసింది.దాని ఫలితంగానే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య నిపుణలు అంటున్నారు.ఇప్పుడు కేసులు తగ్గుమఖం పట్టడంతో లాక్డౌన్ని ఎత్తివేసి నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించనున్నారు.ఇటు అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో కూడా అంతరాష్ట్ర సర్వీసులపై పలు దఫాలుగా చర్చలు జరిగిన తరువాత బస్సుల రాకపోకలు సాగాయి.