ఒడిస్సా ఆంధ్ర బోర్డర్ సాలూరు , కొటియా ప్రాంతంలో ఐరన్ గనులు ఉన్నాయని వాటిని కేటాయిస్తే సరిపోతుందంటూ వ్యాఖ్యానించారు. కొత్త ఉక్కు శాఖ, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి త్వరలోనే వినతిపత్రం ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారపక్షం మినహా అన్ని పక్షాల రాజకీయ నాయకులను కలిసి వారి సహకారం తీసుకోవాలని ఈ సమావేశంలో విజయ సాయి రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా అటు రాజ్యసభ లోక్ సభలో పోడియం వద్ద ఆందోళన చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రెండు రోజులు ఆందోళన చేయాలని... స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడే అన్ని పార్టీలతో అక్కడ మద్దతుగా ఆందోళన చేస్తామని చెప్పుకొచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చిత్తశుద్ధితో పని చేస్తామని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఉక్కు పరిశ్రమలను ఎస్ఎఐఎల్, ఎన్ఎండీసీ లో విలీనం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ....కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏకపక్షంగా ప్రైవేటీకరించాలని ఆలోచన చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే కార్మికుల తో సమావేశమయ్యారని.. రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. పార్లమెంటు బయట , పార్లమెంట్ లోపల స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు.