వైసీపీ నుంచి ఆయన మూడు సార్లు గెలిచారు. పైగా జగన్ కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బాలరాజు తన ఎమ్మెల్యే పదవిని వదులుకొని ఉపఎన్నికలకు వెళ్లి మరి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు 2019లో నేనే మంత్రి పదవి రావాల్సి ఉన్నా... జగన్ అప్పటి సమీకరణల నేపథ్యంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టారు.
పుష్ప శ్రీవాణి ని తప్పించటం ఖాయం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె ప్లేస్ ను బాలరాజు తో భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి . జగన్ కు వీర విధేయుడిగా ఉండడంతోపాటు... వివాదరహితుడిగా ఉండటం , పార్టీ కోసం పదవులు త్యాగం చేయటం ఇవన్నీ ఆయనకు ప్లస్ కానున్నాయి. ఇక జిల్లాలో సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయి.