ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిషోర్ బాబు ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. రవీంద్ర బాబు అమలాపురం ఎంపీగా గెలిచారు. మారిన సమీకరణాల నేపథ్యంలో రవీంద్రబాబు వైసీపీలోకి జంప్ చేసి ఇక్కడ కూడా ఎమ్మెల్సీ గా ఎంపికయ్యారు. ఇక రావెల ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఇలా ఎంతోమంది రాష్ట్ర , కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పోలీసు అధికారి సైతం వైసీపీ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనే మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.
మాజీ డిజిపి దినేష్ రెడ్డి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి సమైక్యాంధ్రలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పదవి విరమణ అనంతరం కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న దినేష్ రెడ్డి మళ్లీ ఇప్పుడు వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ లో చేరితే ఏదైనా పదవి ఇస్తామని హామీ వస్తే ఆయన వైసీపీ కండువా కప్పి కొనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.