మీకు తెల్సు కదా! లగడపాటి ఎన్నికలకు ముందే ఏవో జోస్యాలు చెప్తాడు.. అదేలేండి ఆయనను రగడపాటి అని రాస్తుంటారు. అలా ఇప్పుడు కోమటిరెడ్డి ఆయన లేని లోటు తీరుస్తున్నరు. తెలంగాణలో ఎవరిది గెలుపు ఎవరికి గెలుపు అన్నది తేల్చుతున్న రు. అదేవిధంగా కేసీఆర్ సర్కార్ ను దెప్పి పొడుస్తూ తమకు పేరు ఎక్కడ వస్తుందో అని ఆనాడు తమ హయాంలో ప్రారంభించిన ఎస్ ఎల్ బీసీ పనులనూ, ఇతర సాగు నీటి ప్రాజెక్టుల పెంండింగ్ పనులనూ ముందుకు తీసుకుపోవడం లేదని ఆవేదన చెందారు. అదేవిధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి రానున్న కాలాన తమ లక్ష్యం ఏంటన్నదీ చెప్పారు.
వారు వీరయినా వీరు వారయినా ఓటు ఎటున్నది ముఖ్యం కదా! ఆ లెక్కన తెలంగాణలో పండుగాడెవ్వడు..ఆ మాటల తూటాల లెక్కేంటి అన్నది కూడా తేలాలి. అవి ఈటెల ఖాతాలో చేరినవి కనుక గెలుపు వస్తే సరే! లేదంటే అవన్నీ పూర్తి డాంబికాలే.. ఏదే మైనప్పటికీ..గెలుపు ఏదయినా గెలుపే కదా! మళ్లీ వారి లెక్కలూ వీరి లెక్కలు అని రాస్తారేంటి అని కోపం తెచ్చుకోవద్దు. గెలుపు గెలుపే పెరుగు పెరుగే మజ్జిగ మజ్జిగే కాదనం కానీ ఈ సారి వెన్నలాంటి పాలిటిక్స్ ఏమని తేల్చాయో చెప్పనీయండి.. వాత పెట్టినాక వెన్న రాసిన వారెవ్వరో కూడా తేల్చనీయండి.. ఆ లెక్కన తెలంగాణలో వాత కేసీఆర్ ది కావొచ్చా? పోనీ ఆ వాత ఇంకెవ్వరిది.. డబ్బులతో నడిచే పాలిటిక్స్ లో తాను ఒక లెక్క తేల్చానని చెబుతున్నారు ఆ కాంగిరేసు ఎంపి..ఆయన సర్వే చేసిన విధానం ఏంటన్నది తెల్వక పోయినా తమ పార్టీకి ఇప్పటి వివరం అనుసారం ఐదు శాతం ఓట్లు వస్తాయని, ఈటెల గెలుపు ఖాయమని, టీఆర్ ఎస్ ఓ 30 శాతం ఓట్లు ఖాయం అని జోస్యం చెప్పారు.