తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కలహాలు వస్తున్నాయి.ఆధిపత్యం కోసం పార్టీని ఎదగనీయకుండా చేసే విధంగా చేస్తున్నారు. పార్టీ తమదంటే తమదే అంటూ తమకు కూడా పెత్తనం కావాలని భావిస్తూ పార్టీ ప్రతిష్టను చాలా మంది దిగజార్చుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో బీజేపీకి తిరుగులేని ప్రజాదరణ తీసుకురావాలని పాదయాత్ర చేయాలని భావించిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సంకల్పానికి ఆదిలోనే ఆటంకం ఎదురవుతోంది.పాదయాత్రకు బీజేపీ అధిష్టానం నుంచి అనుమతి అస్సలు రాకుండా చేస్తున్నారు. దీంతో ఆయన ఆశించిన ఆశయం కాస్త నీరుగారేలా ఉంది. పాతబస్తీలో వెలసిన అమ్మవారైనా భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఈనెల 9న పాదయాత్ర చేపట్టాలని సంజయ్ ఇప్పటికే ప్లాన్ ఖరారు చేసుకున్నా అది ఆచరణ సాధ్యం అయ్యేట్లు కనపడట్లేదు. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నట్లు సమాచారం అందింది.

తెలంగాణలో బీజేపీకి భారీ క్రేజ్ తీసుకురావాలని సంజయ్ చాలా ప్రయత్నించిన దేవుడు కరుణించిన  పూజారి కరుణించలేనట్లు దానికి కార్యరూపం దాల్చకుండా చేయడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పదోన్నతి సాధించడంతో తెలంగాణలో జరగబోయే అన్ని కార్యక్రమాలపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం అందింది.

తాను కాకుండా మరొకరు లాభం పొందటం ఆయనకు ఇష్టం లేకనే బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి రాకుండా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో  బండి సంజయ్ పాదయాత్ర తరహాలో ఇతరేతరా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల బాధ్యతలను కిషన్ రెడ్డిపై పెట్టడంతోనే ఆయన సంజయ్ పాదయాత్రకు అడ్డు పడేలా చేస్తుందని సమాచారం.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక బండి సంజయ్ కు పార్టీ లో ఇమేజ్ బాగా పెరిగింది. దీనికితోడు దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జోరు పెరగడం వల్ల ఎలాగైనా బండి సంజయ్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాదయాత్రకు అనుమతి రాకుండా చేయడంలో విజయం సాధించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ఇమేజ్ పెరగకుండా అడ్డుపడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: