తెలంగాణ రాష్ట్రముకు సుమారు రూ.38,114 కోట్ల 'ముద్ర' రుణాలు మంజూరు అయింది . 47.26 లక్షల ఖాతాల్లోకి నిధుల కేటాయింపు జరగనున్నది

కరీంనగర్ బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి వివరణ ఇచ్చారు.కేంద్రం భారీ ఎత్తున నిధులందిస్తున్నదని బండి సంజయ్ తెలపడం జరిగింది.ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు సుమారు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పడం జరిగింది.ఆ మొత్తం 47,26,819 ఖాతాల్లోకి జమ అయ్యాయని కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ గారు తెలిపడం జరిగింది.PMMYలో భాగంగా శిశు మరియు కిషోర్,తరుణ్ పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని 'ముద్ర' నిధులు మంజూరయ్యాయి అని ప్రశ్నించారు.కేటగిరీల వారీగా పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు తెలపడం జరిగింది.ఈ పధకం విషయంలో వచ్చిన ఫిర్యాదులు మరియు వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కరీంనగర్ ఎంపీ అయిన శ్రీ బండి సంజయ్  గారు ఈరోజు అనగా సోమవారం పార్లమెంట్ సాక్షిగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ గారు లిఖిత పూర్వక సమాధానం అందించారు.

2015 ఏప్రిల్ నెలలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రారంభం కాబడింది. అప్పటి నుండి నేటి వరకు దేశ వ్యాప్తంగా సుమారు రూ. 15.52 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయినట్లు తెలిపారు.దీని  వల్ల సుమారు 29.55 కోట్ల మందికి రుణాలు అందాయని తెలపడం జరిగింది. దీనిలో సుమారు 5.20 లక్షల కోట్ల రూపాయల మేరకు రుణాలు 6.80 కోట్ల కొత్త  కొత్త పారిశ్రామికవేత్తల ఖాతాల్లోకి బదిలీ కాబడ్డాయాని వివరించడం జరిగింది.ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) కింద చిన్న వ్యాపార సమస్థల వ్యవస్థాపక కార్యకలాపాల కోసం  సుమారు రూ.50 వేల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపడం జరిగింది. వ్యాపారం, సేవలతోపాటు వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు వంటి  వివిధ రంగాలలో ఆదాయాన్ని పెంచేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

శిశుసంక్షేమ పథకం ద్వారా సుమారు రూ.50 వేలు, కిషోర్ పథకం ద్వారా సుమారు రూ.5 లక్షలు, తరుణ్ పతకం ద్వారా రూ.10 లక్షలలోపు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపడం జరిగింది. నిధులు విడుదల చేయకపోవడం మరియు ఇతర ఫిర్యాదులు వంటి సమస్యలురావడం జరిగితే సంబంధిత బ్యాంకుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించడం జరిగింది.

ఇక తెలంగాణకు సంబంధించి ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం మొదలైనప్పటి నుండి నేటి వరకు గత ఆరేళ్లలో సుమారు 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలపడం జరిగింది. వీటిలో 37,46,740 మంది  సుమారు రూ.50 వేలలోపు (శిశుసంక్షేమ పథకం) రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే సుమారు రూ.5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు తీసుకున్న వారు 7,94,193 మంది సుమారు రూ.10 లక్షలలోపు (తరుణ్ పథకం) రుణాలు తీసుకున్న వారి సంఖ్య  సుమారు 1,85886 మంది ఉన్నట్లు వివరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: