ఈ భేటీలో పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ను ప్రత్యేకంగా పలకరించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ భేటీలో భాగంగా బండి సంజయ్ కుమార్.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రశంశలు కురిపించారు.
జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్ కుమార్. గడిచిన నలబై ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు బండి సంజయ్ కుమార్. దేశంలోని ఓబీసీలంతా ప్రధాని నరేంద్ర మోదీకి రుణపడి ఉంటారన్నారు. దేశ ప్రజలు మిమ్ముల్ని ఎన్నటికీ మర్చిపోరని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్. ప్రధాని మోడీ పాలనలో దేశ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదే స్పూర్తి తో ముందుకు వెళతామన్నారు బండి సంజయ్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలు, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసు కెళ్లాలని తెలంగాణ ఎంపీలకు సూచనలు చేశారు ప్రధాని మోడీ. ఆ తర్వాత ఈ సందర్భంగా బండి సంజయ్ ను ప్రత్యేకంగా పలకరించారు ప్రధాన మంత్రి మోడీ.