నోముల నర్సింహయ్య... అనారోగ్యంతో మృతి చెందడం కారణంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల్లో నోముల నర్సింహయ్య తనయుడు మరియు టిఆర్ఎస్ పార్టీ యంగ్ లీడర్ నోముల భగత్ కుమార్... విజయం సాధించారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ సాధించి... కాంగ్రెస్ పార్టీ లీడర్ జాన రెడ్డి పై గెలుపు బావుటా ఎగురవేశారు. ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి పై 18 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో నోముల భగత్ ఘన విజయం సాధించారు.

నోముల భగత్ విజయంతో టిఆర్ఎస్ పార్టీ మంచి ఊపు లోకి వచ్చింది. ఇది ఉండగా... తాజా గా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్... టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు... ఓ అరుదైన మొక్కలు గిఫ్ట్ గా ఇచ్చారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్. ఈ మేరకు తన సోషల్ మీడియాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ పేర్కొన్నారు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తనకు ఎంతో అభిమానమని... తన ఫేవరెట్ దర్శకుడు ఆర్జివినే అని నోముల భగత్ వెల్లడించారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ను టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నాగార్జునసాగర్  ఉప ఎన్నికల నేపథ్యం లో నోముల భగత్ పులి తో దిగిన ఫోటోను రాంగోపాల్ వర్మ షేర్ చేశారు. ఆ సమయంలో నోముల భగత్ ఫోటో కూడా సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేసింది. ఇక రాం గోపాల్‌ వర్మ... సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండటమే కాకుండా.. పొలిటిషన్లపై కూడా సెటైర్లు వేస్తుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: