సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల్లో  అరచేతిలో వాలి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడో జరిగిన ఘటనను కూడా వెంటనే  తెలుసుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలో కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇటీవలే ఒక బల్లికి సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా గోడమీద పాకే ఒక బల్లి 6500 కిలోమీటర్లు ప్రయాణం చేసింది.  బల్లి అంత దూరం ప్రయాణం చేయడం ఏంటీ అలా అసలు కుదురుతుందా అని ఆశ్చర్య పోతున్నారు కదా.



 అయితే బల్లి పాకు కుంటూ  వెళ్ల లేదు. ఏకంగా విమానంలో ఎగురుకుంటూ ప్రయాణం చేసింది.. ఏకంగా ఒక మహిళ ఆ బల్లిని 6500 కిలోమీటర్లు  విమాన ప్రయాణం చేయించింది.  దీనికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గోడమీద పాకే బల్లి ఏకంగా ఆ మహిళ బ్రా లోకి దూరింది . ఈ క్రమంలోనే ఆ మహిళ  విమాన ప్రయాణం చేయగా ఆ బల్లి కూడా ఆ మహిళ తో పాటే విమాన ప్రయాణం చేసింది. ఏకంగా బార్బడోస్ నుంచి బ్రిటన్ లోని యార్క్ షైర్ వరకు విమానంలో ప్రయాణించింది బల్లి.  యార్క్ షైర్ కు చెందిన లీసా అనే యువతి ఇటీవలే కరేబియన్ యాత్ర కు వెళ్ళింది.



 ఈ క్రమంలోనే ఇక విమాన ప్రయాణంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు తిరిగింది. 6500 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక ఇటీవల ఇంటికి తిరిగి వచ్చి సూట్ కేస్ ఓపెన్ చేసింది. అంతలో ఆ యువతి షాక్ అయింది. ఎందుకంటే  సూట్ కేస్  నుంచి బట్టలు తీస్తుండగా ఆ యువతి బ్రా లో బలిబల్లి కనిపించింది.  ఏకంగా 24 గంటల పాటు ఆ బల్లి అందులోనే ఉంది.  కాగా ఆ బల్లికి బార్బీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం అది రాయల్ సొసైటీ  ఫర్ ద ప్రివెన్షన్ క్రూయల్టీ టు ఎనిమల్స్ సంరక్షణలో ఉండటం గమనార్హం. ఇలా బల్లి ఏకంగా విమానంలో 6500 కిలోమీటర్లు ప్రయాణించటం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: