ఇదే సమయంలో జగన్ కూడా బీజేపీకి ఇంకా దగ్గరవుతున్నారు. అప్పుడు ఆర్ఆర్ఆర్ కు అనుకున్నవిధంగా కేంద్రం సాయం దక్కుతుందా? అన్నది డైలమా. ఇవాళ మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే, ఆ రోజు తనకు టికెట్ ఇచ్చి ఆదుకున్న జ గన్ ను తిట్టిపోశారు. జగన్ వల్లే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్న భయం తనకు ఉందని చెబుతూ తీవ్ర రాజకీయ చర్చకు దారి ఇచ్చారు. నిజంగానే రాష్ట్రం నాశనం అవుతుంటే కేంద్రం ఏం చేస్తుందని? అడ్డుకుని తనదైన నియంత్రణ చర్యలు చేపట్టకుండా మొ ద్దు నిద్ర ఏమయినా పోతుందా? అన్నది వైసీపీ వర్గాల సూటి ప్రశ్న. ఏదేమైనప్పటికీ జగన్ ను తిట్టి, మోడీని పొగిడి ఒకే సమ యంలో రెండు విధాల మాట్లాడి, ఆర్ఆర్ఆర్ తనదైన రాజకీయ చతురత చూపిస్తున్నానన్న ఆనందంలో ఉన్నారని తెలుస్తోంది. ఇవన్నీ ముందున్న కాలంలో ఫలిస్తాయా?
ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన్రోజు. ఆయన పుట్టిన్రోజును పండుగలా చేస్తోంది బీజేపీ. నిరసనలకే పరిమితం అవుతూ, దేశం కోసం ఏమీ చేయలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉపాధి ఇవ్వలేదని చెబుతోంది కాంగ్రెస్. పుట్టిన్రోజు పండుగ రోజు కదా! అలా అని వదిలేయం అని అంటున్నాయి విపక్ష పార్టీలు. మరోవైపు పవన్ లాంటి అభిమాన నాయకులు తాము మోడీకి మద్దతు గానే ఉంటామంటున్నారు. అదే కోవలో నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కూడా ఉన్నారు. ధర్మం కోసమే మోడీ పుట్టా రని, మంచి వారిని కాపాడి చెడ్డవారిని రక్షించే బాధ్యత మోడీదేనని అంటున్నారు. అంతేకాదు మోడీ అంటే తనకెంతో ప్రేమ మరి కొన్ని మాటలూ చెప్పారు. లేఖ కూడా రాశారు. ఇవన్నీ జగన్ ను ఇరకాటంలో పెట్టేవే. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ ఎక్కడా తగ్గడం లేదు.