అనుకున్నట్లుగానే స్వరాజ్ మాజ్దా కంపెనీ మినీ వ్యాన్లను కొనుగోలు చేసిన ఆర్టీసీ... వాటికి ఏసీ, సీటీంగ్లో మార్పులు చేసింది. ప్రతి వ్యాన్కు ఓ ఎల్సీడీ టీవీ, ఆటోమేటిక్ హైడ్రాలిక్ డోర్, ప్రతి బస్సుకు జీపీఆర్ఎస్ అంటూ హంగులు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. 70 లక్షల రూపాయలతో తయారూ చేసిన ఈ బస్సులకు వజ్రా అని పేరు పెట్టి... ఎక్కువగా చిన్న చిన్న డిపోలకే కేటాయించింది. తొలి నాళ్లలో బాగానే నడిచినప్పటికీ... టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో వజ్రా బస్సులు ఎక్కేందుకు ప్రయాణీకులు మొగ్గు చూపలేదు. దీంతో ఈ సర్వీసులు నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత కరోనా రావడంతో... బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. నెమ్మదిగా అన్ని సర్వీసులు ప్రారంభమైనప్పటికీ... వజ్రా బస్సులు తిప్పేందుకు మాత్రం ఆర్టీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడు డిపోల్లోనే ఓ మూలకు చేరుకున్నాయి. సిటింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటం వల్ల ఈ బస్సులను చివరికి అద్దెకు కూడా ఎవరూ అడగటం లేదు. దీంతో ఈ బస్సులను వదిలించుకునేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
అనుకున్నట్లుగానే స్వరాజ్ మాజ్దా కంపెనీ మినీ వ్యాన్లను కొనుగోలు చేసిన ఆర్టీసీ... వాటికి ఏసీ, సీటీంగ్లో మార్పులు చేసింది. ప్రతి వ్యాన్కు ఓ ఎల్సీడీ టీవీ, ఆటోమేటిక్ హైడ్రాలిక్ డోర్, ప్రతి బస్సుకు జీపీఆర్ఎస్ అంటూ హంగులు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. 70 లక్షల రూపాయలతో తయారూ చేసిన ఈ బస్సులకు వజ్రా అని పేరు పెట్టి... ఎక్కువగా చిన్న చిన్న డిపోలకే కేటాయించింది. తొలి నాళ్లలో బాగానే నడిచినప్పటికీ... టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో వజ్రా బస్సులు ఎక్కేందుకు ప్రయాణీకులు మొగ్గు చూపలేదు. దీంతో ఈ సర్వీసులు నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత కరోనా రావడంతో... బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. నెమ్మదిగా అన్ని సర్వీసులు ప్రారంభమైనప్పటికీ... వజ్రా బస్సులు తిప్పేందుకు మాత్రం ఆర్టీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడు డిపోల్లోనే ఓ మూలకు చేరుకున్నాయి. సిటింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటం వల్ల ఈ బస్సులను చివరికి అద్దెకు కూడా ఎవరూ అడగటం లేదు. దీంతో ఈ బస్సులను వదిలించుకునేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.