2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎవరూ ఊహించని రీతిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని కొలుకోలేని దెబ్బ కొట్టిన వైసీపీ అధ్యక్షుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీలో టీడీపీ అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను వరుసగా ఎత్తిచూపుతూ.. టీడీపీ నేతలను ఇరుకున పెడుతున్నారు కూడా. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసులో జైలుకు పంపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మెడకు కూడా ఏపీ ఫైబర్ స్కామ్ చుట్టుకునేలా ఉంది. రెండేళ్ల పాటు టీడీపీని ఆడుకున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం వైసీపీ నేతల టార్గెట్ అంతా కూడా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే ఉంచారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎవరూ ఊహించని రీతిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని కొలుకోలేని దెబ్బ కొట్టిన వైసీపీ అధ్యక్షుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీలో టీడీపీ అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను వరుసగా ఎత్తిచూపుతూ.. టీడీపీ నేతలను ఇరుకున పెడుతున్నారు కూడా. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసులో జైలుకు పంపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మెడకు కూడా ఏపీ ఫైబర్ స్కామ్ చుట్టుకునేలా ఉంది. రెండేళ్ల పాటు టీడీపీని ఆడుకున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం వైసీపీ నేతల టార్గెట్ అంతా కూడా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే ఉంచారు.