గత కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న రాధ తన రాజకీయ భవిష్యత్ పై ఎటువంటి స్టెప్ తీసుకోలేదు అయితే గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ టార్గెట్ గా విరుచుకుపడుతూ ఉండటం మరోవైపు రాధ గుడివాడ పర్యటించడం రాజకీయగా ఆసక్తిని రేకెత్తించింది. దీనితో రాధ స్టెప్ గుడివాడలో పడబోతుందని అనుకుంటున్న సమయంలో అనుహ్యంగా ఇద్దరు నేతలు భేటీ అవడంతో అస్సలు గుడివాడలో ఏమి జరుగుతోందన్నా చర్చ ప్రారంభం అయ్యింది. దీనితో టీడీపీ తరపున రాధా బరిలో ఉంటారా లేక రాధా టీడీపీని వీడి వైసీపీలో చేరతారా అనేది ఎవరికి అంటుపట్టలేదు.కానీ మీడియా సంస్థలు,ఇరువురి అనుచరులు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఇచ్చారు ఇప్పుడే అదే వంగవీటి రాధకు ఆగ్రహం తెప్పించిదట.
గుడివాడలో అనుకోకుండా జరిగిన సమావేశంలో తాను వైసిపిలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని రాధ తీవ్రంగా మండిపడుతున్నారట ఏపీలో అందులోను వైసీపీ నేతలు శుభకార్యాలను సైతం రాజకీయాలకు వాడుకునే చ సంస్కృతి గుడివాడకు పాకిందని శుభకార్యాలలో శత్రువు ఎదురుపడినా పలకరించడం భారతీయ సంప్రదాయమని అనుచరుల వద్ద అన్నారట.అందరూ కలిసి మెలసి ఉండే సంస్కృతి, సంప్రదాయాల స్ధానంలో కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని తాడేపల్లి డైరక్షన్ లో గుడివాడలో యాక్షన్ జరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేసారట వంగవీటి రాధ.చిన్న సమావేశంలో జరిగిన ఘటనను అడ్డం పెట్టుకొని ఇంత నీచంగా ప్రవర్తిస్తారని తాను అనుకోలేదని అనుచరులతో వంగవీటి రాధా చర్చించినట్లు సమాచారం.తాను గుడివాడ వెళ్లే క్రమంలో పామర్రు నుంచి గుడివాడకు ర్యాలీగా తరలి వెళ్ళేందుకు వంగవీటి అభిమానులు సమాయత్తమైతే ర్యాలీలతో శుభకార్యాలకు హాజరు కావడం సభ్యత కాదని తానే అభిమానులను వారించానని మన రాజకీయాలకు శుభకార్యాలు వేధిక కాకూడదని ఒక్కడినే వెళ్తే సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు ఎలా ప్రచారం చేస్తారని పరోక్షంగా అటు సీఎం జగన్ ను ఇటు కొడాలి నానిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు రాధ ..
.
మొత్తానికి నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంపై రాజకీయంగా చర్చ మర్చిపోకముందు వంగవీటి రాధ ఘాటుగా స్పందించడం మాత్రం కొత్త చర్చకు తెరలేపింది. చూడాలి మరి ఈ గుడివాడ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో.