ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ పెద్దలు మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ను వదిలేసి... వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వారణాసిలో రికార్డు స్థాయిలో 22 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇటీవల కాశీలో పర్యటించిన ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అలాగే ఈ పనుల్లో సగానికి పైగా తుది దశకు చేరుకున్నాయన్నారు. నమామి గంగా పేరుతో గంగా ప్రక్షాళన ప్రాజెక్టును వేల కోట్లతో చేపట్టింది మోదీ సర్కార్. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ కేసుకు ముగింపు పలికేలా చర్యలు తీసుకున్న మోదీ సర్కార్... 2023 డిసెంబర్ నాటికి ఆలయాన్ని పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇక వారణాసి, అయోధ్య, అలహాబాద్ మధ్య ట్రై యాంగిల్ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తోంది కేంద్రం. ఇక రైల్వే శాఖ అత్యాధునిక వసతులతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ముందుగా ఢిల్లీ, వారణాసి మధ్య ప్రారంభించారు. ఎన్ని చేసినా... యూపీ ఓటరు మహాశయుడు కమలం పార్టీకి మద్దతు ఇస్తాడో లేదో చూడాలి మరి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ పెద్దలు మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ను వదిలేసి... వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వారణాసిలో రికార్డు స్థాయిలో 22 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇటీవల కాశీలో పర్యటించిన ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అలాగే ఈ పనుల్లో సగానికి పైగా తుది దశకు చేరుకున్నాయన్నారు. నమామి గంగా పేరుతో గంగా ప్రక్షాళన ప్రాజెక్టును వేల కోట్లతో చేపట్టింది మోదీ సర్కార్. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ కేసుకు ముగింపు పలికేలా చర్యలు తీసుకున్న మోదీ సర్కార్... 2023 డిసెంబర్ నాటికి ఆలయాన్ని పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇక వారణాసి, అయోధ్య, అలహాబాద్ మధ్య ట్రై యాంగిల్ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తోంది కేంద్రం. ఇక రైల్వే శాఖ అత్యాధునిక వసతులతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ముందుగా ఢిల్లీ, వారణాసి మధ్య ప్రారంభించారు. ఎన్ని చేసినా... యూపీ ఓటరు మహాశయుడు కమలం పార్టీకి మద్దతు ఇస్తాడో లేదో చూడాలి మరి.