రైళ్ల వేగం పెంచడం, స్టాపులు పెంచడం, మార్గం మళ్లింపు వంటివి కూడా ఉన్నాయి. ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమలు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల వివరాలు అన్ని కూడా ఐఆర్సీటీసీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. అలాగే నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్తో పాటు 139 ఐవీఆర్ఎస్ నంబర్కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలో 872 రైళ్లు నడుస్తుండగా.... ఇందులో 673 రైలు సర్వీసుల వేగాన్ని పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే తిరుగుతున్న సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్, నర్సాపూర్-నాగర్సోల్-నర్సాపూర్, కాచిగూడ-మంగళూరు సెంట్రల్-కాచిగూడ, సికింద్రాబాద్-రాజ్కోట్-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-భువనేశ్వర్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-హైసర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్గా మారుస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు 22 ప్యాసింజర్ రైళ్లను కూడా ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చేశారు అధికారులు.
రైళ్ల వేగం పెంచడం, స్టాపులు పెంచడం, మార్గం మళ్లింపు వంటివి కూడా ఉన్నాయి. ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమలు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల వివరాలు అన్ని కూడా ఐఆర్సీటీసీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. అలాగే నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్తో పాటు 139 ఐవీఆర్ఎస్ నంబర్కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలో 872 రైళ్లు నడుస్తుండగా.... ఇందులో 673 రైలు సర్వీసుల వేగాన్ని పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే తిరుగుతున్న సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్, నర్సాపూర్-నాగర్సోల్-నర్సాపూర్, కాచిగూడ-మంగళూరు సెంట్రల్-కాచిగూడ, సికింద్రాబాద్-రాజ్కోట్-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-భువనేశ్వర్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-హైసర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్గా మారుస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు 22 ప్యాసింజర్ రైళ్లను కూడా ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చేశారు అధికారులు.