వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీని సిద్దూ పీసీసీ అధ్యక్షుని హోదాలో నడిపిస్తారని అంతా భావించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో తలెత్తిన విభేదాలు... ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనితో పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ ప్రకటించారు. అయితే ఈ రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదించలేదు. సిద్ధూతో అధిష్ఠానం చర్చలు జరిపింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్... కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో... ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అంతా భావిస్తున్నారు. త్వరలో ఆయన కమలం గూటికి చేరుకుంటారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సిద్ధూ రాజీనామా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని అంతా భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధిష్ఠానం పెద్దలు... సిద్ధూను బుజ్జగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ నేతృత్వంలోనే జరుగుతాయని ఆయన ప్రధాన అనుచరుడు మొహమ్మద్ ముస్తఫా వెల్లడించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్లో వివాదం టీ కప్పులో తుపానులా మారింది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీని సిద్దూ పీసీసీ అధ్యక్షుని హోదాలో నడిపిస్తారని అంతా భావించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో తలెత్తిన విభేదాలు... ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనితో పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ ప్రకటించారు. అయితే ఈ రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదించలేదు. సిద్ధూతో అధిష్ఠానం చర్చలు జరిపింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్... కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో... ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అంతా భావిస్తున్నారు. త్వరలో ఆయన కమలం గూటికి చేరుకుంటారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సిద్ధూ రాజీనామా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని అంతా భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధిష్ఠానం పెద్దలు... సిద్ధూను బుజ్జగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ నేతృత్వంలోనే జరుగుతాయని ఆయన ప్రధాన అనుచరుడు మొహమ్మద్ ముస్తఫా వెల్లడించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్లో వివాదం టీ కప్పులో తుపానులా మారింది.