కరీంనగర్ జిల్లా :  హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అసెంబ్లీలో rrr సినిమా చూపిస్తామని.. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ లు ప్రజల పక్షాన అసెంబ్లీ లో గలం వినిపిస్తారని అన్నారు బండి సంజయ్.  కార్యకర్తలు అంకిత భావం తో పని చేసి విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు బండి సంజయ్.హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తా రా ? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా ? అని పేర్కొన్నారు బండి సంజయ్.  

ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు, మరియు మంచి నాయకుడని..  ఆయన ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్  నియోజక వర్గం  లో నింపారని పేర్కొన్నారు బండి సంజయ్.  ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలని.. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కున్న నేత ఈటల రాజేందర్ అని వెల్లడించారు బండి సంజయ్.  ఈటల రాజేందర్ కల్మషం లేని బోలా మనిషి ఆయనకు అన్యాయం చేస్తే పాపం తగులుతుందని.. ఆయన తో లబ్ది పొందిన వారు ఆయనను వదిలిన వారికి పాపం తప్పక తగులుతుందని స్పష్టం చేశారు బండి సంజయ్.

కెసిఆర్ పచ్చి మోసగాడని.. కెసిఆర్ ఉద్యమం చేయెలే ఎం చేయలే దొంగ దీక్ష చేశారు. విద్యార్థుల ఆగ్రహం తో తప్పని పరిస్థితిలో దొంగ దీక్ష చేశారని మండిపడ్డారు బండి సంజయ్.  ఎన్ని చేసిన బిజెపి నేత ఈటల రాజేందర్ విజయం సాధించి తీరుతారని.. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు బండి సంజయ్. హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధింస్తే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా ? ఈ సవాల్ ను సీఎం కెసిఆర్ స్వీకరించాలని పేర్కొన్నారు బండి సంజయ్. కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ విజయం సాధించి అసెంబ్లీ లో అడుగు పెడుతారని తెలిపారు  బండి సంజయ్.


మరింత సమాచారం తెలుసుకోండి: