నల్గొండ : మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.  మంత్రి జగదీష్ రెడ్డి కి నిజంగా  దమ్ముంటే  వచ్చే ఎన్నికల్లో మళ్లీ సూర్యాపేటలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.  నువ్వు గెలిస్తే నేను దేనికైనా రెడీ ఛాలెంజ్... గత ఎన్నికల్లో నకిరేకల్ లో గెలిపిస్తా అని ఛాలెంజ్ చేసి గెలిపించి చూపించా...  మళ్లీ నా ఛాలెంజ్ స్వీకరించాలంటూ పేర్కొన్నారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.  

ఆకాశం నుంచి బ్రహ్మ దేవుడు దిగి వచ్చిన నిన్ను సూర్యాపేట లో నేను గెలవనియ్యను... నీకిదే చివరి ఎన్నిక అంటూ మంత్రి జగధీష్ రెడ్డి పై ఫైర్ అయ్యారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో పిచ్చి పిచ్చి వేశాలు మానుకోవాలని.. ఇప్పటి కైనా వైఖరి మార్చుకో అంటూ హెచ్చరించారు.. టీఆర్ఎస్ పార్టీ నేతలు రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారని.. అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

హుజురాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా దళిత బంధు పథకం అమలు చేయండి. మునుగోడు లో ఉన్న 25 వేల కుటుంబాలకు 2 వేల కోట్లు ఇవ్వాలని  డిమాండ్ చేశారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మునుగోడు లో దళిత బందు అమలైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ పోటీ చెయ్యనని.. అలాగే  మునుగోడు నియోజిక వర్గంలో టీఆరెస్ ఎమ్మెల్యే ను దగ్గరుండి గెలిపిస్తానని ప్రకటించారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.   మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తులను తీసుకొని వెళ్లి పార్టీ మారడానికి ప్రోత్సాహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: