2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ 13, టిడిపి 1 గెలుచుకుంది....అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. టిడిపి గెలిచిన ఆ ఒకటి కూడా కుప్పం. అయితే ఆ కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైసీపీ వశం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలిసిందే. అయితే ఇలా చిత్తూరు జిల్లా వైసీపీ వశం కావడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పొచ్చు. జిల్లాపై పెద్దిరెడ్డికి పూర్తి పట్టు ఉంది.
ఆయన బట్టే జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు నిలబడుతారు. గత ఎన్నికల్లో ఈయన మద్ధతుదారులు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడి వైసీపీ తరుపున గెలిచారు. అంటే జిల్లాపై పెద్దిరెడ్డికి ఎంత పట్టు ఉందో అర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే జిల్లాలో జగన్ ఇమేజ్ కంటే పెద్దిరెడ్డి ఇమేజ్ ఎక్కువ పనిచేస్తుంది. పైగా అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి బలం మరింత పెరిగింది. ఆఖరికి కుప్పం కూడా వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారు.
కాబట్టి చంద్రబాబు...ముందు పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి నిలువరించకపోతే...భవిష్యత్లో చిత్తూరులో టిడిపికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఆయన రాజకీయాలకు ధీటుగా వ్యూహాలు వేసి టిడిపిని నిలబెట్టాలి. ఇప్పటినుంచి ఆ ప్రయత్నాలు చేస్తే...కనీసం ఎన్నికల నాటికి టిడిపి కాస్త నిలబడుతుంది. అలాగే జిల్లాలో సగం సీట్లు అయిన గెలుచుకోవచ్చు. అలా కాకుండా లైట్ తీసుకుంటే చిత్తూరులో టిడిపి ఉనికికే ప్రమాదం.