ఏపీ మండలిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. వైసీపీ వర్గాల్లో వినపడుతోన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ సారి కమ్మ , కాపు కోటాలో ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ గ్యారెంటీ అంటున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు జగనే స్వయంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. దీంతో మర్రికి ఈ సారి ఎమ్మెల్సీ పక్కా అంటున్నారు. ఇక చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కు కాపు కోటాలో ఎమ్మెల్సీ ఖాయమైనట్టే ? చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాంను పార్టీలో చేర్చు కోవడంతో ఆమంచికి ప్రాధాన్యత తగ్గినట్టు ఉండకూడదనే ఆయన్ను ఎమ్మెల్సీ చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు.
ఇక బీసీ యాదవ కోటాలో కూడా టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన బీద మస్తాన్రావు కు పదవి ఖాయమైంది. ఆయనకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మద్దతు ఉందంటున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం వైసీపీ ఇన్చార్జ్ భరత్కు కూడా ఎమ్మెల్సీ ఖాయం అంటున్నారు. కుప్పంలో చంద్రబాబును బాగా టార్గెట్ చేసేందుకే ఆయనకు పదవి ఇస్తారంటున్నారు. ఇక చిత్తూరు జిల్లా లో మరో రెడ్డి నేతకు పదవి ఖాయమైందంటున్నారు. ఇక సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును మరోసారి మండలికి పంపుతారని టాక్ ?