21 వేల కోట్ల విలువైన హెరయిన్ ను తరలిస్తున్న కేస్ లో నిన్న కేస్ నమోదు చేసిన ఎన్ ఐ ఎ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాచవరం సుధాకర్ , పూర్ణిమ వైశాలి అనే దంపతులను నిందితులుగా చేర్చింది. వీరిద్దరితో పాటు కోయంబత్తూర్ కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎన్ ఐ ఎ... అతని వద్ద నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. విదేశాల నుండి డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ కోణం లో ఎన్ ఐ ఎ విచారణ చేస్తుంది.
ఈ కేసులో ఉగ్ర మూలాలపై దృష్టి సారించింది ఎన్ ఐ ఎ. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాచారం సుధాకర్ ను ఈ కేసులో కీలకంగా భావిస్తున్నారు. గత ఏడాది తన భార్య వైశాలి పేరు మీద ఆశి ట్రేడింగ్ కంపెనీ స్థాపించాడు. విజయవాడ సత్యనారాయణ పురం లో ని వైశాలి పుట్టింటి చిరునామా తో కంపెనీ అడ్రస్ పెట్టాడు. కంపెనీ సి ఈ సి ను డ్రగ్స్ మాఫియా కు ఇవ్వడం తోనే డ్రగ్స్ దిగుమతి అయ్యినట్టు సుధాకర్ పై అభియోగాలు మోపారు అధికారులు.