రైలు ప్రయాణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రైల్వే శాఖ ఆదేశించింది. మాస్క్ లేని వారికి 5 వందల రూపాయలు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖలో కొవిడ్ నిబంధనలు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని దాదాపు 12 రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని... ఆయా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. త్వరలోనే అన్ని మార్గాల్లో సబర్బన్ రైళ్లను ప్రారంభిస్తామని ప్రకటించిన రైల్వే శాఖ... భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇక దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నామన్నారు. దసరా నవరాత్రి సందర్భంగా... బెంగాల్ రాష్ట్రానికి దేశం నలు మూలల నుంచి స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ. కొవిడ్ సమయంలో కార్గో రవాణా గణనీయంగా పెరిగిందన్నారు. రైల్వే శాఖ రైతుల కోసం, వ్యాపారుల కోసం ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోందన్నారు సునీత్ శర్మ. ప్రతి రైలు కూడా షెడ్యూల్ సమయానికి ముందు పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు.
రైలు ప్రయాణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రైల్వే శాఖ ఆదేశించింది. మాస్క్ లేని వారికి 5 వందల రూపాయలు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖలో కొవిడ్ నిబంధనలు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని దాదాపు 12 రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని... ఆయా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. త్వరలోనే అన్ని మార్గాల్లో సబర్బన్ రైళ్లను ప్రారంభిస్తామని ప్రకటించిన రైల్వే శాఖ... భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇక దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నామన్నారు. దసరా నవరాత్రి సందర్భంగా... బెంగాల్ రాష్ట్రానికి దేశం నలు మూలల నుంచి స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ. కొవిడ్ సమయంలో కార్గో రవాణా గణనీయంగా పెరిగిందన్నారు. రైల్వే శాఖ రైతుల కోసం, వ్యాపారుల కోసం ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోందన్నారు సునీత్ శర్మ. ప్రతి రైలు కూడా షెడ్యూల్ సమయానికి ముందు పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు.