అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఏడవ రోజు ఎజెండా ఒక్కసారి పరిశీలిస్తే... తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే  ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు అని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఏడవ రోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నలు ఒక్కసారి చూసినట్లు అయితే,

1) సోలార్ మరియు పవన విద్యుత్ ఉత్పత్తి

2) రైతుల నుండి పత్తి సేకరణ

3) చీమల వారి గూడెం నుంచి వేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణం.

4) భారీ వర్షాల వల్ల పంట నష్టం

5) షెడ్యూల్లో కులం లోనికి వాల్మీకి సామాజిక వర్గం.

6) రాష్ట్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రశంస

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు  పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు అని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. ఏడవ రోజు  శాసనమండలిలో చర్చకు వచ్చే ప్రశ్నలు ఒక్కసారి చూస్తే,

1) హజ్ హౌజ్..

2) రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు విధానం.

3) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు.

4) ఇళ్ల నిర్మాణాలకు కోసం ఆర్థిక సహాయం

 5) ఎఫ్సిఐ  దొడ్డు బియ్యం కొనుగోలు.

6) పట్టణ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు.

 శాసనమండలిలో ఏడవ రోజు  ఎజెండా ఒక్కసారి చూస్తే,

శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై చర్చించనున్నారు అని అధికారులు పేర్కొన్నారు. ఒక బిల్లును శాసన మండలి లో చర్చించి ఆమోదానికి పెట్టనున్నారని అధికారులు వివరించారు. 1) ద ఇండియన్ స్టాంపు బిల్ 2021 కి (తెలంగాణ సవరణ) బిల్లును.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి.. చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు అని అధికారులు వివరించారు. కాగా మొన్న వర్షాల కారణంగా సమావేశాలను కొన్ని రోజులు పొడిగించారు.తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts