అలా జిల్లాపై పట్టు ఉన్న పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి చంద్రబాబు నానా కష్టాలు పడుతున్నారు. అసలు ముందు పెద్దిరెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నిక...ఎన్నికకు అభ్యర్ధులని మార్చుకుంటూ వెళుతున్నారు. 2009లో పెద్దిరెడ్డి కాంగ్రెస్లో ఉండగా, అప్పుడు టిడిపి తరుపున వెంకటరమణ రాజుని పోటీ పెట్టారు. కానీ అప్పుడు గెలుపు పెద్దిరెడ్డిదే. 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయగా, వెంకటరమణ మళ్ళీ టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఈ సారి లాభం లేదని చెప్పి చంద్రబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బంధువు అనీషా రెడ్డిని ఈ సారి పుంగనూరు బరిలో పెట్టారు. కానీ 2019 ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డిదే విజయం. దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి ప్రత్యర్ధి మారిపోయారు.
ఇప్పటికే అనీషా రెడ్డి యాక్టివ్గా పనిచేయడం లేదు...దీంతో చంద్రబాబు ఆమెని సైడ్ చేసి...పుంగనూరు టిడిపి ఇంచార్జ్గా చల్లా రామచంద్రారెడ్డిని నియమించారు. చల్లాకు పుంగనూరుపై కాస్త పట్టు ఉంది. కానీ పెద్దిరెడ్డికి చెక్ పెట్టే సత్తా మాత్రం లేదనే చెప్పొచ్చు. అక్కడ ప్రజలు ఏకపక్షంగా పెద్దిరెడ్డి వైపు ఉన్నారు. వారు పెద్దిరెడ్డిని దాటి వేరే పార్టీని గెలిపించడం కష్టమే అని చెప్పొచ్చు. మొత్తానికైతే చంద్రబాబు పుంగనూరులో కొత్త ఇంచార్జ్ని పెట్టినా సరే పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం కష్టమే అని చెప్పొచ్చు.